ఒకేసారి సెట్స్ పైకి 2 రీమేక్స్

Thursday,February 21,2019 - 01:19 by Z_CLU

ఈరోజు ఒకేసారి రెండు రీమేక్స్ సెట్స్ పైకి వచ్చాయి. వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో ‘వాల్మీకి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. అటు బెల్లంకొండ కూడా మరో రీమేక్ ను స్టార్ట్ చేశాడు.

 తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ సినిమా తెలుగులోకి రాబోతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ రీమేక్ ను A-స్టుడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తారు. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించి 70 రోజుల్లో సినిమాను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న మరో మూవీ వాల్మీకి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, గ్రే షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఈరోజు స్టార్ట్ అయిన ఫస్ట్ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ పాల్గొనడం లేదు. త్వరలోనే సెట్స్ పైకి వస్తాడు.