Monday,November 25,2019 - 09:50 by Z_CLU
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ పార్టీ నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి కావడంతో ఘనంగా మెగాస్టార్ ఈ వేడుకల్ని స్వయంగా నిర్వహించారు. పార్టీకి రజనీకాంత్, కమల్ హాసన్ మాత్రం ఎటెండ్ అవ్వలేకపోయారు.