జూలై 21న 'వైశాఖం' విడుదల

Monday,July 10,2017 - 11:01 by Z_CLU

‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”మా ‘వైశాఖం’ ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. డి.జె.వసంత్‌ ఈ సినిమాకి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆడియో సెన్సేషనల్‌ హిట్‌ అయింది. త్వరలోనే ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చెయ్యబోతున్నాం. అలాగే థియేట్రికల్‌ ట్రైలర్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్నింటినీ మించి ఈ చిత్రం థీమ్‌ టీజర్‌కి 3 మిలియన్‌కి పైగా వ్యూస్‌ రావడం అనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది.” అన్నారు.


హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం డి.జె.వసంత్‌.