Mahesh-Trivikram Movie - క్రేజీ హీరోయిన్ తో డిస్కషన్ స్టార్ట్
Saturday,May 22,2021 - 04:09 by Z_CLU
Mahesh-Trivikram Movieలో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ అయిన వెంటనే అందరూ పూజా హెగ్డే వైపు చూశారు. ఎందుకంటే, త్రివిక్రమ్ కు లక్కీ హీరోయిన్ ఆమె. దీంతో ఇక సెకెండ్ థాట్ లేకుండా ఆమెనే తీసుకుంటారని అంతా అనుకున్నారు.
అయితే త్రివిక్రమ్ ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. కుదిరితే ఈ సినిమాలోకి జాన్వి కపూర్ ను తీసుకోవాలని అతడు అనుకుంటున్నాడు. ఈ మేటర్ కూడా చాన్నాళ్ల కిందటే బయటకొచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి అప్ డేట్ ఏంటంటే.. త్రివిక్రమ్ తన రిఫరెన్సులన్నీ ఉపయోగించి జాన్విని అప్రోచ్ అయ్యాడు. ఆమెతో స్టోరీ డిస్కషన్లు స్టార్ట్ చేశాడు.
నిజానికి శ్రీదేవి కూతురు కోసం త్రివిక్రమ్ ప్రయత్నించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత కోసం కూడా జాన్వి పేరు తెరపైకి వచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాలకు సంబంధించి కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ రూల్ పెట్టుకుంది. ఇప్పట్లో సౌత్ లో నటించనని గతంలోనే చెప్పేసింది. అలా అరవింద సమేత ఛాన్స్ మిస్సయింది.
మరి జాన్వి అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా త్రివిక్రమ్ ఇప్పుడు మరోసారి ఆమెను సంప్రదించడానికి కారణం ఏంటి? కారణం ఉంది. జాన్వికి ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి. ఇతర హీరోయిన్లతో పోలిస్తే, ఆమె కెరీర్ ఏమంత స్పీడ్ మీద లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు జాన్విని ఎందుకో కన్సిడర్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె సౌత్ సినిమా వైపు వస్తుందేమోనని త్రివిక్రమ్ ఆశ.
పైగా మహేష్-జాన్వి పెయిర్ బాగుంటుంది. హైట్, లుక్స్ అన్నీ సెట్ అవుతాయి. అందుకే అరవింద సమేతలో మిస్ అయిన జాన్విని కనీసం మహేష్ మూవీ కోసమైనా తీసుకురావాలనేది త్రివిక్రమ్ ప్రయత్నం. త్రివిక్రమ్ ప్రయత్నం ఫలిస్తే, మహేష్ ఓ రేర్ రికార్డ్ సృష్టించిన హీరో అవుతాడు.
గతంలో హీరో కృష్ణ శ్రీదేవితో నటించారు. ఇప్పుడు శ్రీదేవి కూతురుతో మహేష్ నటించబోతున్నాడన్నమాట. జాన్వి యాడ్ అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ మరింత పెరగడం ఖాయం. ఎందుకంటే సౌత్ అనేసరికి బాలీవుడ్ హీరోయిన్లు భారీగా డిమాండ్ చేస్తారు మరి.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics