త్రిష 'మోహిని'కి లైన్ క్లియర్

Sunday,July 22,2018 - 12:11 by Z_CLU

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలంగా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి ‘మెహిని’ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళ్, తెలుగు భాష‌ల్లో హర్రర్ కామెడి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఇటివలే సెన్సార్ పూర్తి చేసుకుంది. హ‌ర్ర‌ర్ కామెడి బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు ఆర్‌.మాదేష్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తుంది. జులై 27న రెండు భాషల్లో విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ… త్రిష కి తెలుగులో ఇన్న క్రేజ్ అంద‌రికి తెలుసు.. మెహిని చిత్రం త‌న‌కి కమ్ బ్యాక్ గా వుంటుంది. హ‌ర్ర‌ర్ కామెడి యాక్ష‌న్ చిత్రం గా తెలుగు, త‌మిళ బాష‌ల్లో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుదల చేసిన ట్రైల‌ర్ కి మాంచి క్రేజ్ రావ‌టం తో ఈ చిత్రం పై అంచ‌నాలు పెరిగాయి. విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా హ‌ర్ర‌ర్ బ్యూటి తో అంద‌ర్ని అల‌రిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాడు. త్రిష ఫెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ తో జులై 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం చూసిని సెన్సారు స‌భ్యులు న‌వ్వుతూ వ‌చ్చి నిర్మాత‌కి, ద‌ర్శ‌కుడు కి శుభాకాంక్ష‌లు చెప్పారు. అంతేకాదు ఈ చిత్రం చాలా బాగుంద‌ని, న‌వ్వించినంత సేపు న‌వ్వించి థ్రిల్ చేశార‌ని, ముఖ్యంగా కాన్సెప్ట్ చాలా కొత్త‌గా వుంద‌ని ప్ర‌శంశ‌లు జ‌ల్లు కురిపించారు. ముఖ్యంగా త్రిష న‌ట‌న ఆశ్య‌ర్య‌ప‌రిచింద‌ని ఆమెని ఇది సూప‌ర్ క‌మ్‌బ్యాక్ చిత్రంగా నిలుస్తుంద‌ని మ‌రీ మ‌రీ చెప్పారు. ఈ టాక్ తో ట్రెడ్ లో క్రేజ్ వ‌చ్చింది. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

న‌టిన‌టులు.. త్రిష‌, జాకి, యోగి బాబు, పూర్ణిమ భ‌ఖ్యారాజ్ త‌దిత‌రులు..
ద‌ర్శ‌కుడు.. ఆర్‌. మాధేష్‌
సంగీతం.. వివేఖ్ మెర్విన్‌
సినిమాటోగ్ర‌ఫి.. ఆర్‌.బి.గురుదేవ్‌
ఎడిట‌ర్‌.. దినేష్ పూన‌రాజ్‌
నిర్మాత‌లు.. ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, శ్రినివాస‌రావు ప‌ల్లెల‌, క‌ర‌ణం మ‌ధుల‌త‌, గూడురు కాశిబాబు, డి.వి.మూర్తి
బ్యాన‌ర్‌.. ప్రిన్స్ పిక్చ‌ర్స్ మ‌రియు శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌