త్రిష ఎందుకిలా చేసింది?

Wednesday,June 17,2020 - 04:20 by Z_CLU

“నా చుట్టూ జరుగుతున్న విషయాల గురించి నేను కొన్ని రోజుల పాటు తెలుసుకోవాలని అనుకోవడం లేదు. మైండ్‌ను డిజిట‌ల్ ప్రపంచానికి దూరంగా ఉంచాలనుకుంటున్నాను. ఇంట్లో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ల‌వ్ యు గ‌య్స్.. మ‌ళ్లీ క‌లుద్దాం”

సడెన్ గా త్రిష నుంచి ఈ పోస్ట్ పడింది. అంతే ఆ వెంటనే ఆమె ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ పేజీలు సైలెంట్ అయిపోయాయి. ఆమె తన ఎకౌంట్స్ ను డిజేబుల్ చేయలేదు, కంప్లీట్ కూడా క్లోజ్ చేయలేదు కూడా. కానీ తన నుంచి ఇకపై ఎలాంటి అప్ డేట్స్ ఉండవని మాత్రం క్లారిటీ ఇచ్చేసింది.

ఇంత సడెన్ గా త్రిష ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే త్రిష ఈ నిర్ణయం తీసుకుందని ఎక్కువ మంది అంటున్నారు.

మొన్నటికిమొన్న ప్రియా వారియర్ ఇలానే చేసింది. ఇనస్టాగ్రామ్ నుంచి కొన్నాళ్ల పాటు తప్పుకొని తిరిగి మళ్లీ వచ్చింది. ఇప్పుడు త్రిష కూడా ఇలానే గ్యాప్ తీసుకుంది.

నటీనటులకు రెగ్యులర్ గా తీసుకునే గ్యాప్ తో పాటు ఇకపై ఈ డిజిటల్ గ్యాప్ కూడా అవసరమేమో.