మహేష్ బాబు సినిమాలో హైలెట్ అదే...

Wednesday,January 01,2020 - 09:02 by Z_CLU

మహేష్ బాబు సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హైలట్ అవుతుందట. దాదాపు 30 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ కంప్లీట్ గా హిలేరియస్ గా ఉండబోతుందంటున్నారు మేకర్స్. సినిమాలోని ఫస్టాఫ్ లో ఉండబోయే ఈ సీన్స్ కి ఆడియెన్స్ థ్రిల్ ఫీలవ్వడం గ్యారంటీ అంటుంది ‘సరిలేరు…’ టీమ్.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు మేకర్స్. మరీ పర్టికులర్ గా  సంక్రాంతికి రిలీజ్ అని ఫిక్సయ్యాక, సంక్రాంతికి ధీటుగా సినిమా ఉండేలా, ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమాని తెరకెక్కించారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ తో పాటు, మహేష్ బాబు స్థాయి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది.