ఇక్కడ సక్సెస్ తో అక్కడ ఎంట్రీ

Wednesday,October 16,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న దర్శకుల లిస్టు పెరుగుతుంది. అయితే ఈ ముగ్గురు దర్శకులు మాత్రం కొంచెం వేరు. మిగతా దర్శకుల్లా స్ట్రేట్ గా కొత్త కథతో కాకుండా, టాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సత్తా చూపిస్తున్నారు.

 

గౌతమ్ తిన్ననూరి : టాలీవుడ్ లో చేసింది జస్ట్ 2 సినిమాలే. గ్రాండ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్ లో గ్రాండ్ గా సక్సెస్ అయిన ‘జెర్సీ’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం కాబోతున్నాడు.

దేవకట్ట : రీసెంట్ గా ప్రస్థానం తో బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ సినిమా తరవాత ఈ దర్శకుడు చేసిన సినిమాలున్నా, బాలీవుడ్ ఎంట్రీకి మాత్రం ‘ప్రస్థానం’ నే ఎంచుకున్నాడు. దీని తరవాత టాలీవుడ్ లో సినిమాలు చేస్తాడా..? లేకపోతే బాలీవుడ్ పైనే కంప్లీట్ గా ఫోకస్ పెడతాడా..? అనేది ప్రస్తుతానికి తెలీదు కానీ, దేవకట్ట రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేస్తాడు అనిపించుకున్నాడు.

సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి బాలీవుడ్ లో జస్ట్ ఎంట్రీ కాదు, పర్మనెంట్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. కరియర్ స్టార్ట్ అయింది టాలీవుడ్ తోనే అయినా, ఇప్పుడు రెండో సినిమా కూడా బాలీవుడ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు.