"తోలుబొమ్మలాట" సెన్సార్ పూర్తి

Monday,November 18,2019 - 11:14 by Z_CLU

డా. రాజేంద్రప్రసాద్‌ నటించిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 22 న విడుదల కానుంది . విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.

నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ ”ఒక కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వంటి భావోద్వేగాల కలబోత ఈ చిత్రం. ఒక కుర్రాడు ఇంత లోతైన, ఉద్వేగభరితమైన భావాలున్న కుటుంబ కథని ఎలా ఎదుర్కొని, పరిష్కరించాడు అనేది తెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.” అని చెప్పారు.

సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి