పక్కా ప్లాన్ తో నితిన్

Sunday,April 07,2019 - 12:32 by Z_CLU

దాదాపు ఏడు నెలల తర్వాత వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు నితిన్. చంద్ర శేఖర్ ఏలేటితో ఓ సినిమా వెంకీ కుడుములతో ‘భీష్మ’ అలాగే కృష్ణ చైతన్య తో మరో సినిమా చేయబోతున్నాడు. చంద్ర శేఖర్ ఏలేటితో చేయబోయే సినిమాతో పాటు ‘భీష్మ’ ను కూడా ఇదే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఇటివలే ఓ చిన్న గాయం కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు నితిన్. పూర్తిగా కోలుకున్న వెంటనే  రెండు సినిమాలను ఒకే సారి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఈ రెండు సినిమాలను ఓ కొలిక్కి తీసుకొచ్చాకే కృష్ణ చైతన్య సినిమాను స్టార్ట్ చేస్తాడు. సొంత బ్యానర్ లోనే ఈ సినిమా చేస్తున్న నితిన్ వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాతో పాటు నితిన్ మరో సినిమాను కూడా సెట్ చేసుకొనే పనిలో ఉన్నట్లు సమాచారం. అంటే వచ్చే ఏడాదికి కూడా ముందే రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడన్న మాట యూత్ స్టార్.  ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు నితిన్.