వీళ్ళు వెరీ స్పెషల్...

Friday,May 25,2018 - 05:27 by Z_CLU

ఒకప్పుడు భారీ సినిమా అంటే టాప్ స్టార్, అంతకంటే మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. అలాంటి కాంబినేషన్ కుదరాలి కానీ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే, ఆ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఈ మధ్య కాలంలో గమనిస్తే టాలీవుడ్ ట్రెండ్ మారిందనిపిస్తుంది. టాప్ మోస్ట్ స్టార్స్ యంగ్ డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడమే కాదు, కొత్త కథలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

 

నాగ్ అశ్విన్ : నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే మోస్ట్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న ఈ ఫిల్మ్ మేకర్, ‘మహానటి’ లాంటి బయోపిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడని కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి టాప్ స్టార్స్ నమ్మి సపోర్ట్ చేయడం ఆలోచించాల్సిన విషయం.

సుజిత్ : 2014 లో ‘రన్ రాజా రన్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కట్ చేస్తే సెకండ్ మూవీ ప్రభాస్ తో.. సాహో సినిమా అనౌన్స్ చేసినప్పుడే అందరి దృష్టి అప్రయత్నంగా సుజిత్ పైనే నిలిచింది. ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేయాలంటే ప్రతి దర్శకుడు కి డ్రీమ్ లాంటిది. అలాంటిది జస్ట్ ఒక్క సినిమాతోనే భారీ అవకాశాన్ని అందుకున్నాడు సుజిత్.

 

అనిల్ రావిపూడి : దర్శకుడిగా పట్టుమని 3 సినిమాల అనుభవం. ఇప్పుడు వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్  లో ఫన్ & ఫ్రస్ట్రేషన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు అనిల్ రావిపూడి. కథ బలంగా ఉండి ఒక స్టార్ ని ఇంప్రెస్ చేయడం పెద్ద విషయం కాదేమో కానీ, ఇద్దరు స్టార్స్ ని మల్టీస్టారర్ కి కన్విన్స్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది వెంకీ, వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే, డైరెక్టర్ పై నమ్మకంతోనే.

 

శ్రీరామ్ ఆదిత్య :  ‘భలే మంచిరోజు’, ‘శమంతకమణి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్స్ తరవాత న్యాచురల్ గానే శ్రీరామ్ ఆదిత్య ఈ సారి ఎలాంటి సినిమా చేస్తాడా..? అనే ఆలోచన అందరిలోను క్రియేట్ అయి ఉంది. ఇంతలో నాని, నాగార్జున కాంబినేషన్ లో సినిమా అనగానే ఒక్కసారిగా వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. స్టోరీ న్యారేట్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ అడ్వైజ్ చేసిన నాని, నాగార్జున చివరికి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సెట్స్ పైకి రావడం చకచకా జరిగిపోయాయి.