రూమర్లకు చెక్ పెట్టిన డిస్కోరాజా

Tuesday,May 07,2019 - 01:30 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఆ పుకార్లను నిర్మాత రామ్ తళ్లూరి, ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ ఖండించారు.

ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ తో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు. జూన్ 21 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఈ చిత్రం లో ఆర్ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి, రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ త ళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.