#ThankYouCollector - సెప్టెంబర్ 8 నుండి!

Wednesday,September 01,2021 - 07:35 by Z_CLU

దేవకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రిపబ్లిక్’ ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8 నుండి #ThankYouCollector అంటూ కొందరు కలెక్టర్స్ గురించి చెప్తూ వీడియోస్ రిలీజ్ చేయబోతున్నారు.

“సరిహద్దుల్లో నిలబడి, విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికుడంటే, మనకు ఎంతో గౌరవం. వారి వీరిగాథలు ఎన్నో విన్నాం. చూశాం. కానీ, దేశ సరిహద్దుల్లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థపై చేసే అన్యాయాల నుంచి రోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. వాళ్ల గురించి మనలో ఎంతమంది తెలుసు? అలాంటి ధైర్యవంతులైన కలెక్టర్లను గుర్తించి, ‘థ్యాంక్యూ కలెక్టర్‌’ పేరుతో వారి గాథలను మీ ముందుకు తీసుకొస్తాం” అంటూ ఎనౌన్స్ మెంట్ వీడియో ద్వారా మేటర్ తెలియజేశాడు సాయి ధరం తేజ్.

ఈ నెల 8 నుండి కొందరు కలెక్టర్స్ గురించి వీడియో ద్వారా చెప్పబోతున్నారు టీం. అయితే ఈ సిరీస్ వీడియోస్ లో ఎవరెవరి గురించి చెప్తారు ? వారు ప్రజలకి సేవ ఏంటి ? అనేది క్లియర్ గా చెప్పనున్నారు. సాయి ధరమ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. JB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics