మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అవ్వకముందే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అన్న ప్రచారం జరిగింది. తనకి కలిసొచ్చిన ఈ ఇద్దరిని ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు. అయితే కాంబో ఎనౌన్స్ మెంట్ రోజు తమన్ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మేకర్స్ 11 ఏళ్ల తర్వాత మహేష్ -త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటూ దాన్ని మాత్రమే హైలైట్ చేసి ఎనౌన్స్ చేశారు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. ఓ వైపు మణిశర్మ పేరు కూడా వినిపించింది. అయితే త్రివిక్రమ్ మాత్రం తమన్ నే ఫిక్సయ్యాడని గట్టిగా వినబడుతుంది. అల వైకుంఠపురములో సినిమాకు బెస్ట్ ఆల్బం ఇచ్చి తన మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు తమన్. అందుకే త్రివిక్రమ్ కి తమన్ తప్ప మరో బెస్ట్ ఆప్షన్ లేదు.
తమన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినబడింది. అవును అరవింద సమేత , అల వైకుంఠపురములో సినిమాల్లో వరుసగా పూజ నే తీసుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిల్లో స్టార్ హీరోయిన్స్ డేట్స్ దొరకడం కష్టం. అల వైకుంఠపురములో తర్వాత పూజ బిజీ మరింత బిజీ అయ్యింది. కానీ త్రివిక్రమ్ సినిమాకు అడగాలే కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయడం ఖాయం. అందుకే త్రివిక్రమ్ పూజనే ఫిక్సయ్యాడని అంటున్నారు.
Pooja-Hegde-Stills-పూజా-హెగ్డే
ఏదేమైనా సినిమాకు సంబంధించి డీటెయిల్స్ బయటికి రాకముందే త్రివిక్రమ్ -మహేష్ సినిమాకు తమన్ , పూజా పేర్లు తెరపైకి వచ్చాయి. ఆల్మోస్ట్ వీరిద్దరూ ఫిక్స్ అన్నమాట గట్టిగానే వినబడుతుంది. మరి అల వైకుంఠపురములో కాంబో మళ్ళీ #SSMB సినిమాకు రిపీట్ అవ్వడం ఖాయం అన్నమాట. మరి ఈ కాంబో మరోసారి అదే విజయాన్ని అందుకుంటుందా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics