Zombie Reddy - రిలీజ్ డేట్ ఫిక్స్
Tuesday,January 12,2021 - 03:04 by Z_CLU
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’తో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నాడు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు విడుదలను ఫిబ్రవరి 5కు మార్చారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘జాంబీ రెడ్డి’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశాం. ఈ విషయంలో నాకు పలు ఫోన్లు, మెసేజ్లు వచ్చాయి. సినిమాను పోస్ట్పోన్ చేయాల్సిందిగా ఇండస్ట్రీ పెద్దలు సూచించారు. వారి సూచన మేరకు ‘జాంబీ రెడ్డి’ని మేం క్వారంటైన్లో పెట్టాం. ఫిబ్రవరి 5న ‘జాంబీ రెడ్డి’ థియేటర్లకు వచ్చి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు.”
టాలీవుడ్కు జాంబీ కాన్సెప్ట్ కొత్త. ఈ జాంబీ కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ హై-కాన్సెప్ట్ ఫిల్మ్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావడం విశేషం. ఇప్పటికే రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.