మరో స్టార్ ని ఇంట్రడ్యూస్ చేయనున్న తేజ

Thursday,March 09,2017 - 01:30 by Z_CLU

ప్రస్తుతం రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సెట్స్ పై ఉన్న బిజీగా తేజ, త్వరలో మరో స్టార్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడనే టాక్ టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, నందిత, కాజల్ లాంటి స్టార్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన మరో స్టార్ డాటర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే రెస్పాన్సిబిలిటీని భుజాన వేసుకున్నాడని టాక్.

ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫం అయితే కాలేదు కానీ, జీవిత, రాజశేఖర్ ల కూతురు శివానిని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అందునా ఈ సినిమాని 2017 లోనే సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారన్న విషయం టాలీవుడ్ స్ట్రీట్స్ లో కాస్త ఫాస్ట్ గానే స్ప్రెడ్ అవుతుంది.

శివాని హీరోయిన్ గా తెరంగేట్రం చేయనున్న సినిమా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమానా, లేకపోతే తేజ మార్క్ లవ్ స్టోరీనా లాంటి డీటేల్స్ అయితే తెలియడం లేదు కానీ, తేజ మాత్రం ప్రస్తుతానికి ‘నేనే రాజు న్నే మంత్రి’ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.