ట్రైలర్ తో రెడీ అవుతున్న తాప్సి...

Sunday,July 16,2017 - 11:05 by Z_CLU

లేటెస్ట్ గా బాలీవుడ్ లో వరుస సినిమాలతో సందడి చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ తాప్సి తెలుగులో మళ్ళీ రి ఎంట్రీ కి రెడీ అయింది. ప్రెజెంట్ తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలో నటించిన తాప్సి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి ఐయామ్ బ్యాక్ అంటూ సినిమా పై అంచనాలు పెంచేసింది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తో మరో సారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది తాప్సి.

‘మనుషులు దెయ్యాలని భయపెట్టడం’ అనే కాన్సెప్ట్ తో హార్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను జులై 19 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మహి వి రాఘవ్ దర్శకత్వంలో 70MM ENTERTAINMENTS బ్యానర్ పై విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 18న థియేటర్స్ లోకి రానుంది.