నేను అస్సలు పట్టించుకోను

Monday,May 29,2017 - 05:00 by Z_CLU

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి లేటెస్ట్ గా ‘పింక్’,’నామ్ షబానా’ వంటి సినిమాలతో నటి గా మంచి గుర్తింపు అందుకున్న ముద్దుగుమ్మ తాప్సి త్వరలోనే ‘ఆనందో బ్రహ్మ’ అనే సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ సందడి చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ ఈ భామకి టాలీవుడ్ లో ఆఫర్స్ కరువయ్యాయని అందుకే బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బిజీ అయిందంటూ వస్తున్న వార్తలను తాప్సి ఖండించింది.

ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ” తెలుగులో ‘సాహసం’ సినిమా నటిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆ సినిమా తర్వాత అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ గుడ్ కాన్సెప్ట్ తో ఉండే సినిమాలు మాత్రమే చేయాలనీ డిసైడ్ అయ్యాను. ‘పింక్’,’నామ్ షబానా’ టైం లో కూడా తెలుగు లో కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ మంచి కాన్సెప్ట్ లా అనిపించలేదు. అందుకే కొన్ని రిజెక్ట్ చేశా. ఇక నా గురించి వస్తున్న వార్తలను అస్సలు పట్టించుకోను. నటిగా నేను ఏదో కొత్తదనం చూపించాలనుకుంటున్న సమయంలో డైరెక్టర్ మహి ‘ఆనందో బ్రహ్మ’ కథ చెప్పాడు. నటిగా నేను మెచ్చి ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది.  నిజానికి ఈ కథ చెప్పినప్పటీకే బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం కుదరదని చెప్పేశాను. కానీ నాకోసం డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దాదాపు సంవత్సరం వెయిట్ చేశారు. నటిగా నాకిది చాలా గొప్పగా అనిపించింది. జెనరల్ గా స్టార్ హీరో కోసం ఇలా వెయిట్ చేస్తారు. కానీ ఒక హీరోయిన్ కోసం వెయిట్ చేయడం చాలా అరుదు. సో నేను చాలా హ్యాపీ” అని అన్నారు. టాలీవుడ్ లో కనుమరుగవ్వడానికి తాప్సి చెప్పిన రీజన్ ఇది..