షాకింగ్.. బాలీవుడ్ హీరో సుశాంత్ సూసైడ్

Sunday,June 14,2020 - 03:29 by Z_CLU

బాలీవుడ్ కు మరో షాక్. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో సుశాంత్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడట. దానికి అతడు ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడట.

అతడు నటించిన ఆఖరి చిత్రం డ్రైవ్ గతేడాది నవంబర్ లో రిలీజైంది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. అంతలోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్.

క్రికెటర్ ధోనీ బయోపిక్ గా వచ్చిన ఎమ్మెస్ ధోనీ సినిమా సుశాంత్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ధోనీ పాత్రలో సుశాంత్ యాక్టింగ్ అందర్నీ ఫిదా చేసింది.