నారప్ప, విరాటపర్వం షూటింగ్స్ మరింత లేట్

Wednesday,July 01,2020 - 12:34 by Z_CLU

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న నారప్ప, విరాటపర్వం సినిమాల షూటింగ్స్ లేట్ అవుతాయని ప్రకటించారు నిర్మాత సురేష్ బాబు. ఇప్పటికిప్పుడు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే పరిస్థితి లేదంటున్నాడు. దీనికి ఆయన చెప్పే రీజన్ ఇది.

“క‌రోనా ప్ర‌భావం పూర్తిగా తగ్గే వ‌ర‌కు నార‌ప్ప‌, విరాట‌ప‌ర్వం సినిమాల‌ను షూట్ చేయ‌ను. మేం షూట్ చేయాల్సిన సీన్స్ అన్నీ ఎక్కువ మంది జ‌నాల‌తో షూట్ చేయాల్సిన‌వే ఉన్నాయి. 40-50 మందితో షూటింగ్ చేస్తే బాగోదు. సీన్స్‌ను మార్చ‌లేను. అలాగే సినిమా థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌దు. ఓపెన్ అయినా వెంట‌నే జ‌నాలు వ‌స్తారో రారో ఇప్పుడే చెప్ప‌లేం.”

ఇలా వెంకీ, రానా సినిమాలపై క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు. మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్పందిస్తూ ఇకపై రానా కూడా తన బ్యానర్ పై వచ్చే సినిమాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాడని ప్రకటించారు.

“డెసిషన్స్ త‌నే పూర్తిగా తీసుకుంటాడ‌ని చెప్ప‌ను. కొన్ని సినిమాల‌కు నా నిర్ణ‌యం ఉంటుంది. కొన్ని త‌ను డిసైడ్ చేస్తాడు. తను యాక్ట‌ర్, స్టూడియో అధినేత‌, నిర్మాత… మా నాన్న‌ రామానాయుడులా ఈ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ను ఇంకా పెద్ద‌ది చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నాడు. త‌ను ఈ రంగంలోకి ఎంతో ప్యాష‌న్‌తో వ‌చ్చాడు.”