చివరి రోజు సందడి చేసిన సూపర్ స్టార్

Saturday,April 01,2017 - 06:00 by Z_CLU

సూపర్ స్టార్ రజిని కాంత్ లేటెస్ట్ గా ధనుష్ సినిమా సెట్ లో సందడి చేశాడు. రజిని కూమార్తె సౌందర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘విఐపి-2’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా చివరి రోజు ఈ సినిమా సెట్లో కాసేపు సందడి చేశారు రజిని..

తన కుమార్తె అల్లుడు ధనుష్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజే తన ఆశీస్సులు అందించిన సూపర్ స్టార్ లేటెస్ట్ గా షూటింగ్ పూర్తయిన సందర్భంగా మరో సారి ఈ సినిమా యూనిట్ ను సెట్ లో కలిసి అభినందించారు..


తెలుగులో ‘రఘువరన్’ గా రిలీజ్ అయిన సినిమాకు కొనసాగింపు గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘రఘువరన్ -2’ గా రిలీజ్ కానుంది. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..