వరుస కమర్షియల్ సక్సెస్ లు తన సొంతం చేసుకొన్నసునీల్ హీరోగా… ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై నాలుగోవారం లో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన మూడు పాటలు విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా మెదటి పాటలో సునీల్ డాన్స్ లు ప్రతి ఒక్కర్ని ఎట్రాక్ట్ చేస్తాయట. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు, స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం.
అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుందట. సునీల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ ను సినిమాలో చూడొచ్చంటున్నారు. ప్రకాష్రాజ్ , పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించారు.