డ‌బ్బింగ్ స్టేజ్ లో "ఉంగరాల రాంబాబు"

Tuesday,April 18,2017 - 07:15 by Z_CLU

సునీల్ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని డ‌బ్బింగ్ స్టేజ్ లోకి ఎంటరైంది. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మే నెల‌లో ఉంగరాల రాంబాబు చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్ర‌కాష్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్ ల కాంబినేష‌న్ లో సునీల్ చేసిన కామెడీ ఈ సినిమాకు హైలెట్ కాబోతోంది. ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ కామెడి మూవీగా ఉంగరాల రాంబాబు సినిమా నిలుస్తుందని యూనిట్ అంటోంది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కుదిరితే ఈనెల్లోనే పాటల్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.