అగ‌ష్టు 29 నుండి  సునీల్, క్రాంతి మాధవ్ చిత్రం రెండ‌వ షెడ్యూల్

Tuesday,August 23,2016 - 01:43 by Z_CLU

 

‘జ‌క్క‌న్న’ తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని త‌న సోంతం చేసుకుని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెండ‌వ షెడ్యూల్ ని అగ‌ష్టు 29 నుండి ప్రారంభిస్తున్నారు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఈ చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం.
నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హ్రుద‌యాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూ, సునిల్ త‌ర‌హ కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షయిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందిచబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా త‌న కామెడి తో జ‌క్క‌న్న చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యాన్ని త‌న ఖాతాలో జ‌మ‌చేసుకున్నాడు. ఈ చిత్రంలో త‌న  క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు.  ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు.  అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెండ‌వ షెడ్యూల్ ని అగ‌ష్టు 29 నుండి ప్రారంభిస్తున్నారు.  అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ”అని అన్నారు.