సందీప్ కిష‌న్ కొత్త సినిమా డీటెయిల్స్

Friday,May 08,2020 - 02:13 by Z_CLU

నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి.

ఈ చిత్రానికి రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్న ఈ చిత్రం అంద‌మైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానుంది.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రానికి షిఫ్ట్ అవుతాడు సందీప్.

టెక్నీషియన్స్

క‌థ‌: భాను బోగ‌వ‌ర‌పు
ద‌ర్శ‌కుడు: రామ్ అబ్బ‌రాజు
నిర్మాత‌: పి. కిర‌ణ్‌
బ్యాన‌ర్‌: ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌