ఆ బయోపిక్ నేను చేయడం లేదు.. హీరో క్లారిటీ

Wednesday,November 27,2019 - 12:57 by Z_CLU

2 రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ పై జోరుగా స్పెక్యులేషన్ నడుస్తోంది. సందీప్ కిషన్ హీరోగా ఈ బయోపిక్ రాబోతోందనేది ఓ హాట్ న్యూస్ అయితే.. నాని లేదా రాజ్ తరుణ్ లో ఒకరు ఈ బయోపిక్ లో నటించే ఛాన్స్ ఉందనేది మరికొన్ని గాసిప్స్ సారాంశం. ఈ ముగ్గురు హీరోలకు సంబంధించి ఇప్పుడు ఒకరి నుంచి క్లారిటీ వచ్చేసింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయడం లేదని సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు

“2 రోజుల నుంచి ఉదయ్ కిరణ్ బయోపిక్ కు సంబంధించి చాలా రూమర్లు వింటున్నాను. దీనిపై నా నుంచి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. బయోపిక్ కు సంబంధించి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ప్రస్తుతానికి నాకు బయోపిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు.”

ఇలా ఉదయ్ కిరణ్ బయోపిక్ పై సూటిగా స్పందించాడు సందీప్. ఇక మిగిలింది నాని, రాజ్ తరుణ్ మాత్రమే. వీళ్లలో నాని, బయోపిక్స్ జోలికి వెళ్లే రకం కాదు. కాబట్టి ఇక మిగిలింది రాజ్ తరుణ్ మాత్రమే. అతడు ఈ బయోపిక్ లో నటిస్తాడా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ఉదయ్ కిరణ్. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు అతడు. వరుస హిట్స్ తో ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్లాడో, వరుస ఫ్లాపులతో అంతే త్వరగా కిందకు పడిపోయాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఎలిమెంట్స్ అన్నీ కవర్ అయ్యేలా బయోపిక్ తీయాలని అనుకుంటున్నారు కొంతమంది.