బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కే ఎందుకిలా...?

Sunday,April 07,2019 - 02:19 by Z_CLU

‘రంగస్థలం’ , ‘భరత్ అనే నేను’ సినిమాలు విడుదలై ఏడాది గడిచిపోయింది. ఈ సినిమాలను తెరకెక్కించిన టాప్ డైరెక్టర్స్ సుకుమార్ , కొరటాల మాత్రం ఇంకా నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రాకుండా బ్రేక్ తీసుకుంటున్నారు. గతేడాది బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంటనే సినిమాలు చేస్తారనుకున్న ఈ దర్శకులు ఫ్యాన్స్ ని నిరాశపరిచారు.

‘రంగస్థలం’ సినిమాతో నాన్ బాహుబలి రికార్డు అందుకున్న సుకుమార్ కొన్ని నెలలకే మహేష్ తో నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసాడు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా క్యాన్సెల్ అయింది. వెంటనే అల్లు అర్జున్ తో మరో సినిమాను అనౌన్స్ చేసాడు సుక్కు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న బన్నీ ఆ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చాకే సుకుమార్ తో సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎటు లేదన్నా సుకుమార్ నెక్స్ట్ సినిమా థియేటర్స్ లోకి రావడానికి కచ్చితంగా ఇంకో ఏడాది పడుతుందనడంలో సందేహం లేదు.

ఇక కొరటాల పరిస్థితి కూడా ఇంతే… భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత మెగా స్టార్ తో మెగా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు కొరటాల. స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. ప్రస్తుతం చిరు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ సైరా రిలీజ్ అయ్యాకే ఈ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు చిరు. సో కొరటాల నెక్స్ట్ సినిమా కూడా ఇంకో ఏడాది గానీ థియేటర్స్ లోకి రాని పరిస్థితి.

ఇలా నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే ఏడాది టైం తీసుకున్న ఈ టాప్ డైరెక్టర్లు మళ్ళీ క్యూరియాసిటీ రైజ్ చేసే ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటూ మళ్ళీ బ్లాక్ బస్టర్ డెలివరీ చేయాలని భావిస్తున్నారు. వీళ్ళ సినిమాల కోసం మరో ఏడాది వెయిట్ చేయకతప్పదు.