పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో సుకుమార్ సినిమా

Tuesday,May 16,2017 - 07:30 by Z_CLU

కుమారి 21 F తరవాత సుకుమార్ ప్రొడక్షన్ లో వస్తున్న నెక్స్ట్ సినిమా ‘దర్శకుడు’. హరిప్రసాద్ జక్క డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్, ఇషా జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను జూన్ 9 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా మ్యాగ్జిమం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ నెల 22 న ఈ సినిమా తీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్ మ్యాగ్జిమం మే లాస్ట్ వీక్ కల్లా ఆడియో ని కూడా రిలీజ్ చేస్యాలనే ఆలోచనలో ఉన్నారు. సుకుమార్ నిర్మాతగా కుమారి 21 F తరవాత వస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.