అదే బ్యానర్ లో సుకుమార్ సినిమా ?

Sunday,February 18,2018 - 11:03 by Z_CLU

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న సుకుమార్ ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకోచ్చేసాడు. ఇప్పటికే ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 30 న థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే ఉంటుందని సమాచారం. సుకుమార్ క్రియేటివిటీ కి ఫిదా అయిపోయిన నిర్మాతలు నెక్స్ట్ సినిమా కూడా తమ బ్యానర్ లోనే చేయాలనీ ఆ సినిమా కోసం ఇటివలే అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.

రంగస్థలం రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోనున్న సుకుమార్ మళ్ళీ మైత్రి లోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం సుక్కు డిసైడ్ అవ్వలేదని తెలుస్తుంది. ఇప్పటికే సుక్కు లిస్టు లో ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి సుకుమార్ నెక్స్ట్ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.