శీతాకాలంలో సుహాసిని
Monday,February 22,2021 - 12:20 by Z_CLU
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగశేఖర్ – భావనరవి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోయింది. ఇండస్ట్రీలో వర్గాల్లోనూ ఈ సినిమా పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్గా చూసుకుంటూ చేతులు కలిపారు.
ఇప్పుడీ ప్రాజెక్టులోకి సీనియర్ నటి సుహాసిని కూడా చేరారు. ఈ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఈమె ఫోటోను కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.