ఇంట్రెస్టింగ్ గాసిప్.. నిజమైతే సూపర్

Friday,June 12,2020 - 10:30 by Z_CLU

ఒకే కుటుంబానికి చెందిన హీరోలు కలిసి నటిస్తే అభిమానుల్లో ఆ కిక్కే వేరు. బాలయ్య-ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటాడు. ఇక వెంకీ-రానా కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే చూడాలని దగ్గుబాటి అభిమానుల కోరిక. చిరు-చరణ్ అయితే ఇప్పటికే కలిసి నటించారు.

అయితే ఈ లిస్ట్ లో ఘట్టమనేని కుటుంబం నుంచి పెద్దగా డిమాండ్స్ లేవు. దీనికి రెండు కారణాలు. ఒకటి మహేష్-కృష్ణ కలిసి ఇప్పటికే పలు సినిమాలు చేయడం. రెండోది మహేష్-గౌతమ్ కలిసి ఆల్రెడీ ఓ సినిమా చేయడం. ఇక మిగిలింది ఒకే ఒక్క కాంబినేషన్. అదే మహేష్-సుధీర్ బాబు కాంబో. త్వరలోనే ఈ కాంబో కూడా వర్కవుట్ అవుతుందంటున్నారు కొంతమంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్న “సర్కారు వారి పాట” సినిమాలో సుధీర్ బాబు ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కీలకమైన బ్యాంక్ ఎపిసోడ్ ఒకటి ఉందట. అందులో ఓ ఇంపార్టెంట్ పాత్రకు సుధీర్ బాబు అయితే బాగుంటుందని పరశురామ్ భావిస్తున్నాడట.

ప్రస్తుతానికైతే ఇది గాసిప్పే. కానీ నిజమైతే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అటు సుధీర్ బాబు కూడా మహేష్ తో కలిసి నటించడానికి చాన్నాళ్లుగా వెయిటింగ్.