రెండు సినిమాలతో స్టార్ హీరోలు

Wednesday,May 10,2017 - 10:00 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోలు ఫాన్స్ కి బంపర్ ఆఫర్ అందిస్తూ బుల్లెట్ లా దూసుకుపోతున్నారు.. మొన్నటివరకు ఏడాదికో సినిమా చేస్తే చాలనుకున్న హీరోలు సైతం ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా రెడీ చేస్తున్నారు. అలా రెండు సినిమాలతో ఫాన్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న స్టార్ హీరోలపై ఓ లుక్కేద్దాం..


ఏడాదికో సినిమాతో ఎంటర్టైన్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ పై పెట్టబోతున్నాడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న పవన్, అతి త్వరలోనే తమిళ దర్శకుడు నేసన్ తో తెరకెక్కే సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలతో పెద్ద గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ అందించాలని చూస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ ఓ వైపు మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీలో నటిస్తూనే మరో వైపు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు.. ఆగస్టు లో స్పైడర్ తో ఎంటర్టైన్ చేసి మరి కొన్ని నెలల్లోనే కొరటాల తో చేయబోయే సినిమాను థియేటర్స్ లోకి దింపాలని చూస్తున్నాడు మహేష్…

బాహుబలితో వచ్చిన రెండేళ్ల గ్యాప్ ను రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లెవెల్ చేయబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే సుజీత్ తో సాహో సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్.. మరోవైపు రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ లవ్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడు. సో.. నెక్స్ట్ ఇయర్ రెబల్ స్టార్ ఫాన్స్ కు డబుల్ ధమాకా అన్నమాట.


యంగ్ టైగర్ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రెడీ చేస్తూ థియేటర్స్ లో హంగామా చేయాలని చూస్తున్నాడు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాడు.


ప్రెజెంట్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో నటిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కి త్వరలోనే ప్యాకప్ చెప్పేసి వక్కంతం వంశీ డైరెక్షన్ లో ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.


ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొరటాల దర్శకత్వంలో చేయబోయే సినిమాను ఫిక్స్ చేసుకుని సుక్కు సినిమా నుంచి కొరటాల సినిమాకు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాడు..సో చెర్రీ కూడా నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మెగా ఫాన్స్ లో ఖుషి నింపబోతున్నాడు.


దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ అందరిలా ఒకటి తర్వాత మరొకటి కాకుండా ఏకంగా రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పై పెట్టేసి ఈ రెండు సినిమాలతో ఐయామ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ‘టచ్ చేసి చూడు’.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘రాజా ది గ్రేట్’ సినిమాలు చేస్తున్నాడు.