శ్రీనివాస‌రెడ్డి హీరోగా "జంబలకిడిపంబ"

Wednesday,January 03,2018 - 01:55 by Z_CLU

`గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన స‌బ్జెక్టుల‌తో క‌థానాయ‌కుడిగా మారిన ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు శ్రీనివాస‌రెడ్డి హీరోగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. `జంబ‌ల‌కిడి పంబ‌` పేరుతో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై మను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోందంటున్నారు మేకర్స్.

శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మార్చి 10 వ‌ర‌కు ఏకథాటిగా షూటింగ్ చేస్తారు. హైద‌రాబాద్‌, ఈస్ట్ గోదావ‌రి, వైజాగ్‌, అర‌కు, కేర‌ళ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తారు.

రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిది ఈ చిత్రంలో చాలా కీల‌క‌మైన పాత్ర‌. వెన్నెల‌కిశోర్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం గోపీసుంద‌ర్‌