శ్రీదేవి కూతురు హీరోయిన్ గా సినిమా

Wednesday,November 15,2017 - 05:40 by Z_CLU

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తుందంటూ కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పక్కా అయింది. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ శ్రీదేవి కూతురు జాన్వీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా పేరు ధడక్.

జీ స్టుడియోస్, కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ మూవీతో జాన్వితో పాటు ఇషాన్ కూడా వెండితెరకు పరిచయమౌతున్నాడు. గతంలో బద్రినాద్ కి దుల్హనియా లాంటి సూపర్ హిట్ తీసిన శశాంక్ ఖైతాన్ ఈ ప్రాజెక్టుకు దర్శకుడు.

నిజానికి ఇదొక రీమేక్ సినిమా. మరాఠిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైరాట్ కు రీమేక్ గా ధడక్ వస్తోంది. మరాఠిలో కూడా జీ స్టుడియోస్ సంస్థే ఈ సినిమాను నిర్మించింది. ఇప్పుడు హిందీ వెర్షన్ ను కూడా జీ-స్టుడియోస్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 6న ధడక్ రిలీజ్ కాబోతోంది.