హైదరాబాద్ లో ప్రారంభమైన స్పైడర్ బుకింగ్స్

Friday,September 22,2017 - 05:37 by Z_CLU

మహేష్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇవాళ్టి నుంచి అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి. బుక్ మై షో లాంటి కొన్ని సైట్లు ఆన్ లైన్ లో స్పైడర్ టిక్కెట్స్ ను అమ్మకానికి పెట్టాయి. ఇలా పెట్టి ఎనౌన్స్ చేసిన కొన్ని గంటలకే టిక్కెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. రేపట్నుంచి మరిన్ని థియేటర్లను యాడ్ చేయబోతున్నారు.

అటు ఓవర్సీస్ లో ఒక రోజు ముందు నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో 26వ తేదీకే ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు. ఇప్పట్నుంచే ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా.. ప్రీమియర్స్ తో పాటు రెగ్యులర్ షోజ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మహేష్ కెరీర్ లోనే అత్యథికంగా హయ్యస్ట్ స్క్రీన్స్ పై ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కు ప్లాన్ చేస్తున్నారు.

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ పై క్రేజ్ కు ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మరోవైపు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మహేష్, మురుగదాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని స్పైడర్ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.