మహానటి ఎఫెక్ట్: తెరపైకి సౌందర్య, ఉదయ్ కిరణ్

Thursday,May 17,2018 - 01:41 by Z_CLU

మహానటి సూపర్ హిట్ అయిన తర్వాత చాలా మంది సినీ ప్రముఖుల జీవితాలపై మేకర్స్ కన్నుపడింది. ఇందులో భాగంగా సౌందర్య లేదా జయలలిత బయోపిక్ ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి. వీటితో పాటు ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా తెరపైకొచ్చింది. తేజ ఈ బయోపిక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఉదయ్ కిరణ్ ను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి తేజ. చిత్రం అనే సినిమాతో హీరోగా మారిన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు కెరీర్ లో వరుస ఫ్లాపులు చవిచూశాడు. అదే డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నాడనే ప్రచారం కూడా ఉంది. ఈ వివరాలతో ఓ బయోపిక్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ.

ఉదయ్ కిరణ్ బయోపిక్ లో ఓ ప్రముఖ పాత్రను రాజశేఖర్ తో, తన పాత్రను వేరే డైరక్టర్ తో చేయించే ప్లాన్ లో ఉన్నాడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తర్వాత, తేజ ఇలా ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు.

అటు రాజ్ కందుకూరి కూడా సౌందర్య బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ నిర్మాత, హైదరాబాద్ వచ్చిన వెంటనే సౌందర్య బయోపిక్ పై ఓ ప్రకటన చేస్తానంటున్నాడు. మొన్నటివరకు జయలలిత బయోపిక్ గురించి ఆలోచించిన ఈ ప్రొడ్యూసర్.. ఇప్పుడు సౌందర్య జీవితంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.