అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతున్న 2.0

Tuesday,November 27,2018 - 12:03 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.0 సినిమా, అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా అంతటా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా ప్రారంభమైన వెంటనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

హైదరాబాద్ లో 2.0 సినిమాకు సంబంధించి మొదటి రోజు దాదాపు 90శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మెయిన్ థియేటర్లలో, మరీ ముఖ్యంగా త్రీడీ స్క్రీన్స్ లో వంద శాతం అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయింది. అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది.

ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా 3 రోజుల పాటు 2.0 టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఓవర్సీస్ లో అత్యధిక స్క్రీన్స్ లో విడుదలవుతున్న ఇండియన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన 2.0 మూవీ, అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.