సిద్దార్థ్ ఈసారి 'వదలడు'

Thursday,September 26,2019 - 09:30 by Z_CLU

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సిద్దార్థ్ అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తూ విజయాలు అందుకుంటున్నాడు. మొన్నీ మధ్య  ‘గృహం’ తో తెలుగు లోనూ మంచి విజయం సాదించిన సిద్దు ఇప్పుడు ‘వదలడు’ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ లో సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరువం’ సినిమాను ‘వదలడు’ టైటిల్ తో తెలుగులో నరేష్ కుమార్,శ్రీధర్ లు రిలీజ్ చేస్తున్నారు.

సిద్దార్థ్ సరసన కేథరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.  అక్టోబర్ 11 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించి విజయం అందుకుంటాడేమో చూడాలి.