Siddharth ReEntry - మహాసముద్రంతో మళ్లీ...!
Friday,September 18,2020 - 11:48 by Z_CLU
వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
మల్టీటాలెంటెడ్ సిద్ధార్థ్ ఈ క్రేజీ మల్టీస్టారర్లో నటించేందుకు అంగీకరించాడు. చివరిసారిగా డబ్బింగ్ ఫిల్మ్ ‘గృహం’తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చాలా కాలం తర్వాత టాలీవుడ్కు Siddharth ఈ సినిమాతో Re-entry ఇస్తున్నాడు. సరైన స్క్రిప్ట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్న ఆయన ఎట్టకేలకు ‘మహాసముద్రం’ రూపంలో అలాంటి స్క్రిప్టు రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సూపర్స్టార్ మహేష్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మాసివ్ బ్లాక్బస్టర్ను నిర్మించిన ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. దాని తర్వాత ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది.
సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్న MahaSamudram Movie సంబంధించి ప్రతి వారం ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇందులో భాగంగా త్వరలోనే హీరోయిన్ల పేర్లు వెల్లడిస్తారు.