కేన్స్ ఫెస్టివల్ లో శృతిహాసన్

Wednesday,May 10,2017 - 11:50 by Z_CLU

ప్రపంచం కేన్స్ ఫెస్టివల్ కి రెడీ అవుతుంది. మే 17 నుండి 28 వరకు సెలెబ్రేట్ కానున్న ఈ ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా స్టార్స్ పార్టిసిపేట్ చేసి ఈ ఫెస్టివల్ కి మరింత అందాన్ని ఆడ్ చేయబోతున్నారు. అయితే ఈ ఫెస్టివల్ లో శృతి హాసన్ కూడా పార్టిసిపేట్ చేయనుంది.

జయం రవి, ఆర్య హీరోలుగా సుందర్ C డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘సంఘమిత్ర’ సినిమా ప్రెస్టీజియస్ కేన్స్ ఫెస్టివల్ లో అఫీషియల్ గా లాంచ్ కానుంది. ఈ సందర్భంగా తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ కేన్స్ రెడ్ కార్పెట్ పై వాక్ చేయనుంది శృతిహాసన్.

ఇకపోతే కేన్స్ ఫెస్టివల్ లో బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యా రాయ్ దగ్గరి నుండి సోనమ్ కపూర్ వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కించుకున్న వాళ్ళే. కానీ సౌత్ నుండి ఫస్ట్ టైం ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసే లక్కీ చాన్స్ శృతికి దక్కింది.