మహేష్ తో శృతి హాసన్ ?

Sunday,October 22,2017 - 02:13 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాలతో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలోనే వంశీ పైడిపల్లి తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించనుందనే వార్త మొన్నటి వరకూ వినిపించగా ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ గా శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది.

‘శ్రీమంతుడు’తో గ్రాండ్ హిట్ అందుకొని సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచిన మహేష్ – శృతి జోడీ నే మళ్ళీ ఈ సినిమాకు రిపీట్ చేయాలను చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కోసం యూనిట్ శృతి ని సంప్రదించారని టాక్. మరి మహేష్ తో హీరోయిన్ గా చెరో సినిమా చేసిన వీరిద్దరిలో మళ్ళీ నటించే ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో..చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అశ్వనీదత్-దిల్ రాజు సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.