Shradha Srinath - ఈసారి హారర్ టచ్

Saturday,November 07,2020 - 08:54 by Z_CLU

హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో తన స్పెల్-బైండింగ్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం “కలియుగం” అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తోంది.

కలియుగం అనేది హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. “ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.