షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 22,2019 - 11:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అన్నపూర్ణ ఎడెకరాల్లో వేసిన హౌజ్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.


రవితేజ ‘డిస్కో రాజా’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకూ గోవాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఐస్ ల్యాండ్ షూట్ జరుగుతుంది. 25 నుండి హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రతి రోజూ పండగే’ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ప్రస్తుతం పల్లెటూరి సన్నివేశాలను తీస్తున్నారు. అక్టోబర్ 3 వరకూ ఈ షెడ్యుల్ జరగనుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ లో సినిమా థియేటర్స్ లోకి రానుంది.


కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘ఎంత మంచి వాడవురా’ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరుగుతుంది. ఇటీవలే నటశా దోషి పై ఓ ఐటమ్ సాంగ్ అలాగే ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించిన కోటి పల్లిలో కొన్ని సీన్స్ తీస్తున్నారు . శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ పై ఉమేష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజర్. జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


కార్తికేయ ’90ml’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో వేసిన సెట్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీక‌రించారు. అక్టోబ‌ర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మిగిలిన మూడు పాట‌ల‌ను యూర‌ప్‌లో షూట్ చేయబోతున్నారు. అశోక్ గుమ్మకొండ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకుడు. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.