సెట్స్ పైకొచ్చిన నాగచైతన్య, సాయిపల్లవి మూవీ

Monday,September 09,2019 - 02:42 by Z_CLU

ఫిదా సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఆన్ లొకేషన్ లో జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

ఎసియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్ శేఖర్ కమ్ములకి స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య గారు క్లాప్ కొట్టగా, డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ షూటింగ్ ఈ రోజు హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ సీన్ తో మొదలైంది.

మూడు షెడ్యూల్స్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయబోతున్నారు. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ 10 రోజుల పాటు జరుగుతుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నాడు. విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు.

టెక్నికల్ టీమ్ :
ఆర్ట్ : రాజీవ్ నాయర్
కెమెరా : విజయ్ సి కుమార్
మ్యూజిక్ : పవన్
సహా నిర్మాత: విజయ్ భాస్కర్
పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం : శేఖర్ కమ్ముల.