30 ఇయర్స్ కంప్లీట్ చేసిన శివాజీ రాజా ``కళ్లు`` సినిమా
Sunday,August 12,2018 - 01:14 by Z_CLU
శివాజీ రాజా హీరోగా 1988 లో నటించిన సినిమా `కళ్లు` 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. . ఈ సినిమాకి మూల కథ గొల్లపూడి మారుతి రావు `కళ్లు నాటకం` ఆధారంగా ఎం.వి.రఘు ఈ సినిమా కి దర్మకత్వం వహించగా ఇవివి సత్యనారాయాణ ఈ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేశారు. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రీ పాటలు రాయడంతో పాటు `తెల్లారిందే` అంటూ పాట కూడా పాడారు. ఈ చిత్రంలో రంగడు అనే క్యారెక్టర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎంతో మంది కొత్త నటీనటులకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
శివాజీ రాజా మాట్లాడుతూ: ` ఎప్పుడు ఈ రోజు జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే , కాని ఇప్పుడు ఎప్పడో 30 ఇయర్స్ బ్యాక్ నేను హీరో గా వర్క్ చేసిన `కళ్లు` సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. 31 ఇయర్ప్ బ్యాక్ నా ఫేవరెట్ డైరెక్టర్ పెద్ద వంశీ గారు నన్ను హీరోని చేస్తానని కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ కి తీసుకున్నారు. ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడే మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో కోర్స్ పూర్తి చేసుకున్న, అప్పుడు కరాటే నేర్చుకొని ఫిట్ గా ఉన్న దానికి తోడు పెద్ద డైరెక్టర్ దొరకడం,ఆ సినిమా కోసం ఆయన వెంటే తిరిగేవాడ్ని. సరిగ్గా రెండు రోజుల్లో అవుట్ డోర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా నన్ను తీసేసి నరేష్ ని పెట్టారు. ఆ డిప్రెషన్ లో ఉండగా ఇవివి సత్యనారాయాణ గారు నేను చెన్నైలో ఉండేవాళ్లం, ఆయన ఎం.వి.రఘు గారు కళ్లు అనే సినిమా తీస్తున్నారు. ఆడిషన్స్ కి వెళ్లు అన్నారు.
అప్పుడే ఫస్ట్ టైం చేతికి , మెడలో ఉన్నవి తాకట్టు పెట్టుకుని ఫస్ట్ టైం ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లాను అదే ఫ్లైట్ లో ఎం.వి రఘు గారు కలిసే వెళ్లాము. కళ్లు అంటే నేను గొల్లపూడి మారుతిరావు కళ్లు అనుకోలేదు. అవే కళ్లు అని కొప్పురి శేషగిరి గారు అది అనుకున్నాను. హైదరాబాద్ లో ఇంటర్వ్యూ లో నేను 1983 లో ఏదైతే కళ్లు నాటకం వేశానో అదే నాటకంలో నేను , రాజేశ్వరి గారు క్లైమాక్స్ చేశాము. విత్ ఇన్ 5 మినిట్స్ లో తెలిసి పోయింది సినిమాకి సెలక్ట్ అయ్యాను. చాలా న్యాచురల్ గా ఈ చిత్రాని తీసారు రఘు గారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను చాలా మంది గొప్పవాళ్లతో వర్క్ చేయడం చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఎంతో గొప్ప వాళ్లతో ఈ సినిమా లో నటించడం నాకు ఆనందం. మళ్లీ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది`అన్నారు.