Aadavaallu Meeku Johaarlu కొత్త రిలీజ్ డేట్

Saturday,February 19,2022 - 05:31 by Z_CLU

Sharwanand , Rashmika’s ‘Aadavaallu Meeku Johaarlu’ on March 4th

శర్వానంద్ , రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుండటంతో ఉన్నపళంగా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు మార్చ్ 4న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Sharwanand , Rashmika's 'Aadavaallu Meeku Johaarlu' on March 4th

కొత్త రిలీజ్ డేట్ ని ఓ ఫ్యామిలీ పోస్టర్ ద్వారా తెలియజేశారు. శర్వానంద్ , రష్మిక జంటగా వస్తున్న ఈ సినిమాలో రాధికా , ఊర్వసి, ఖుష్బు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా  మిగతా నటీమణులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సిబుల్ ఫిలిమ్స్ తో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల శర్వాతో చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ , సాంగ్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా చేశాయి. త్వరలోనే మిగిలిన పాటలు , ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆడవాళ్ళకు మంచి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు దర్శకుడు. ‘శతమానం భవతి’ తర్వాత శర్వా నుండి వస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics