Sharwanand , Rashmika’s ‘Aadavaallu Meeku Johaarlu’ on March 4th
శర్వానంద్ , రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుండటంతో ఉన్నపళంగా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు మార్చ్ 4న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
కొత్త రిలీజ్ డేట్ ని ఓ ఫ్యామిలీ పోస్టర్ ద్వారా తెలియజేశారు. శర్వానంద్ , రష్మిక జంటగా వస్తున్న ఈ సినిమాలో రాధికా , ఊర్వసి, ఖుష్బు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మిగతా నటీమణులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సిబుల్ ఫిలిమ్స్ తో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల శర్వాతో చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ , సాంగ్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా చేశాయి. త్వరలోనే మిగిలిన పాటలు , ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆడవాళ్ళకు మంచి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు దర్శకుడు. ‘శతమానం భవతి’ తర్వాత శర్వా నుండి వస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics