కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ సినిమా !

Friday,March 06,2020 - 10:58 by Z_CLU

శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘శ్రీకారం’ కాగా మరొకటి శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో చేస్తున్న బైలింగ్వెల్ సినిమా. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా శర్వా ఇప్పుడు మరో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు. త్వరలోనే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. లేటెస్ట్ గా శర్వా పుట్టిన రోజు సందర్భంగా సినిమాను సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం రామ్ తో ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు కిషోర్ తిరుమల. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే శర్వా సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు శర్వా రెండు సినిమాలు పూర్తి చేసుకొస్తాడు.