నాలుగో సినిమా రెడీ చేస్తున్నాడు !

Sunday,March 08,2020 - 12:09 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు రెడీ చేస్తుంటే శర్వానంద్ మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. అవును ఇటివలే ‘జాను’తో థియేటర్స్ లోకొచ్చిన శర్వా సమ్మర్ లో ‘శ్రీ కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు నెలలకే శ్రీ కార్తిక్ డైరెక్షన్ లో నటిస్తున్న బైలింగ్వెల్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఈ మూడు సినిమాలతో ఆగకుండా ఈ ఏడాదిలోనే మరో సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తాజాగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు శర్వా. నెక్స్ట్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్నాడు. మే లేదా జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో షూట్ ఫినిష్ చేసి ఇయర్ ఎండింగ్ లో థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు శర్వా. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ చేసి ఓ అరుదైన రికార్డు అందుకుంటాడు శర్వా.