చెరో సగం పంచుకున్నారు...

Saturday,September 17,2016 - 09:00 by Z_CLU

సోషల్ మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్ అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు, మరెన్నో ఫొటోల్ని షేర్ చేస్తూ నిత్యం పవన్ అభిమానుల్ని ఎంగేజ్ చేస్తుంటారు రేణుదేశాయ్. ఇంకా పవన్ గురించి మాట్లాడ్డమేంటనే కామెంట్స్ కు కాస్త ఘాటుగా కూడా స్పందించారు. పవన్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదా అని సూటిగానే ప్రశ్నించారు. ఈ కామెంట్స్ ను పట్టించుకోకుండా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ను నెటిజన్స్ తో పంచుకున్నారు రేణుదేశాయ్.

pawan-renu-2

      ఖుషీ నాటి సంగతుల్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన ఓ విషయాన్ని ట్వీట్ చేశారు. సూపర్ హిట్ అయిన ఖుషి సినిమాకు రేణుదేశాయ్ ఎడిటర్ గా కూడా పనిచేశారట. ఆ విషయాన్ని రేణుదేశాయ్ స్వయంగా వెల్లడించారు. సినిమాలోని ప్రేమంటే సులువుకాదురా… చెలియ-చెలియా అనే పాటల్ని తను సగం ఎడిట్ చేశానని… ఆ సమయంలో తనకు తీవ్రంగా జ్వరం వచ్చిందని.. అప్పుడు పవన్ కల్యాణ్ మిగతా సగభాగం ఎడిటింగ్ పూర్తిచేశారని రేణు చెప్పుకొచ్చింది. అలా ఖుషీ టైమ్ ను పవన్-రేణు చెరోసగం పంచుకున్నారు.