ఒకేసారి నలుగురు కుర్రహీరోలతో పోటీ

Thursday,July 13,2017 - 07:10 by Z_CLU

ఈ వీక్ బాక్సాఫీస్ దగ్గర నలుగురు యంగ్ హీరోలతో పోటీ పడబోతున్నాడు సీనియర్ హీరో జగ్గూ భాయ్. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘శమంతకమణి’ తో పాటు జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘పటేల్ SIR’రేపు ఒకేసారి విడుదలవుతున్నాయి. వీళ్లలో ఆ నలుగురు గెలుస్తారా..లేక పటేల్ మెరిపిస్తాడా అనేది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.

నలుగురు యంగ్ హీరోలు కలిసి నటించిన సినిమా ‘శమంతకమణి’ … వీళ్లకు కూడా ఓ సీనియర్ సపోర్ట్ ఉంది. సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో కీ రోల్ లో నటించాడు. వీరందరూ కలిసి ఒకేసారి ఒకే కారులో థియేటర్స్ కి వస్తున్నారు.. సినిమా పై చాలా అంచనాలున్నాయి. భలే మంచి రోజు తర్వాత శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపటి నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది.

ఇక కారుకు ఆపోజిట్ గా బుల్లెట్ పై దూసుకొస్తున్నాడు ‘పటేల్ SIR’. సీనియర్ స్టార్ జగపతి నటించిన ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి.. ఈ సినిమాలో కొత్త మేకోవర్ లో స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు జగ్గూభాయ్ .. సినిమా ఊహించని విధంగా ఉంటుందని ఇప్పటికే పోస్టర్ల మీద ప్రింట్ చేసి మరీ చెప్తుంది యూనిట్. సో ఈ వీక్ థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది.